కొవిడ్ కిట్లు పంపిణీ చేసిన జేఎన్‌టీయూ

by  |
కొవిడ్ కిట్లు పంపిణీ చేసిన జేఎన్‌టీయూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధితో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి జేఎన్‌టీయూ సిబ్బంది కొవిడ్ కిట్లను పంపిణీ చేసింది. ఈ కిట్లను మొదటగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు అందించి ప్రారంభించారు. ప్రాథమిక దశలోనే వ్యాధికి సరైన చికిత్సలు చేపడితే వ్యాధి నయం చేసుకోవచ్చని జేఎన్‌టీయూ రిజిస్ట్రర్ మంజూర్ హుస్సెన్ సూచించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన డోక్సిసైక్లిన్, పారసిటమాల్, విటమిన్ సీ, మల్టీ విటమిన్, లెవోసిటిరైజన్, రాంటాడిన్, విటమిన్ డి, మిథైల్‌ప్రెడ్నిసొలోన్ మందులను అందించారు. వీటితో పాటు అవసరమైన శానిటైజర్లను, మాస్క్‌లను కూడా కొవిడ్ కిట్లతో కలిపి పంపిణీ చేపట్టారు.



Next Story

Most Viewed