బీజేపీ నేతలు లుచ్చాగాళ్ల లెక్క మాట్లాడటం మానుకోవాలి.. జీవన్ రెడ్డి ఫైర్

by  |
jeevan
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల సహనాన్ని బీజేపీ నేతలు పరీక్షించాలని చూస్తే బట్టలు ఊడదీసి కొడతారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. టీఆర్ఎస్‌ఎల్పీ‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతల తాటాకు చప్పుళ్ళకు భయపడమన్నారు. రైతుల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వెచ్చించినట్లు తెలిపారు.

బురదజల్లే రాజకీయ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అని ధ్వజమెత్తారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. రైతులపై మిడతల దండులా బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఆరోపించారు. దిమాక్ లేని ఎంపీ బండి సంజయ్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.

మొత్తం 6550 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామని, అవసరమైతే మరో రెండు వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.18 వందల కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. గతంతో రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి మాదిరిగానే బీజేపీ పరిస్థితి కానుందని జోస్యం చెప్పారు. బీజేపీ నేతలు బిచ్చగాళ్ళు, లుచ్చాగాళ్ల లెక్క మాటలు మానుకోవాలని సూచించారు. ఒళ్ళు దగ్గర పెట్టు కొని మాట్లాడాలని లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.


Next Story

Most Viewed