ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జీగా జీవన్‌రెడ్డి

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జీగా జీవన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ను ప్రకటించింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాలని సూచించారు. అదే విధంగా దుబ్బాక ఉపఎన్నికలకు సంబంధించిన మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించారు.

సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

టీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ప్రజా ప్రతినిధులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపింది.

Next Story

Most Viewed