- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: విద్యారంగాన్ని ఈ ఏడాది కూడా కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కొన్ని వార్షిక పరీక్షలను రద్దుచేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. తాజాగా.. జేఈఈ మెయిన్స్-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరుగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని 15 రోజుల ముందుగానే విద్యార్థులకు తెలియజేస్తామని ఎన్టీఏ తెలిపింది. కాగా, ఇటీవల తెలంగాణలో కూడా ఈ ఏడాది టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదావేశారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.