ముగిసిన జేసీ కస్టడీ

by  |
jc prabhakar reddy
X

దిశ, వెబ్‌డెస్క్: దళిత పోలీసును దూషించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసు కస్టడీ ముగిసింది. ఆయన్ను అనంతపురంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసును దూషించినందుకు జేసీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ కోరగా.. కోర్టు ఒక రోజు మాత్రమే అనుమతించింది. శనివారమే జేసీని విచారించాల్సి ఉండగా.. సెలవు దినం కావడంతో ఆదివారం విచారణ కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Next Story