మావోయిస్టులను వేడుకుంటున్న చిన్నారి.. వీడియా వైరల్

by  |
మావోయిస్టులను వేడుకుంటున్న చిన్నారి.. వీడియా వైరల్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఛత్తీస్‌గఢ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్ జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషం కన్నా, అతన్ని వదిలిపెడ్తారా లేదా అనే భయమే ఎక్కువగా ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేరే పప్పాకు చోడ్ దే’ అంటూ కన్నీరు మున్నీరుగా ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడిన వీడియో అందరినీ కంట తడిపెట్టిస్తోంది.



Next Story

Most Viewed