- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో తన మొదటి చిత్రం ‘ధడక్’తో పోల్చితే మెచూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందుకు ప్రశంసలు కూడా అందుకుంది. అయితే, పాజిటివ్తో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుండగా..మిక్స్డ్ కామెంట్స్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది జాన్వీ.
తను సినిమా గురించి ప్రతీ రివ్యూ చదువుతున్నాను అని..ప్రతీ కామెంట్ చూస్తున్నాను అని తెలిపిన జాన్వీ.. తన నటన గురించి ట్రోల్స్ పాజిటివ్గా తీసుకున్నట్లు చెప్పింది. కానీ, నెపోటిజం గురించి తనపై వస్తున్న కామెంట్స్తో అప్ సెట్ అయినట్లు చెప్పింది. తన పని తాను హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ పోతున్నాను అని చెప్పిన జాన్వీ..జయాపజయాలు గురించి ప్రేక్షకులే నిర్ణయిస్తారని తెలిపింది.
కాగా, ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్’ తర్వాత జాన్వీ కపూర్ మరో చిత్రం ‘రూహ్ అఫ్జా’ కూడా ఓటిటిలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. హనీమూన్లలో నవ వధువులను అపహరించే దెయ్యం కథను కామెడీ హారర్ జోనర్లో హార్దిక్ మెహతా తెరకెక్కించారు. రాజ్ కుమార్ రావ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.