పెయింటర్‌గా రాణించేందుకు జాన్వీ ప్రయత్నం

by  |
పెయింటర్‌గా రాణించేందుకు జాన్వీ ప్రయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్ :

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాతో హిట్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. జాన్వీ నటనకు కాంప్లిమెంట్స్ ఇచ్చినవారు కొందరైతే.. కామెంట్స్ చేసినవారు మరికొందరు. అయితే నటనపరంగా కామెంట్స్ యాక్సెప్ట్ చేస్తానని.. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడతానని తెలిపిన జాన్వీ.. నెపోటిజం పేరుతో నిందించడం సరికాదని చెప్పింది. ఇలాంటి కామెంట్స్ నుంచి ప్రశాంతత కోరుకున్న జాన్వీ.. ఈ క్రమంలోనే పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టింది.

గతవారం బెస్ట్ పెయింటర్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. పెయింటింగ్స్‌తో పాటు దిగిన పిక్ షేర్ చేసిన జాన్వీ.. వీటిని చూస్తుంటే హ్యాపీగా ఉందని చెప్పింది. వీటిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ కూడా ఉండగా.. చాలా మంది ఫాలోవర్స్ ‘ది పవర్ పఫ్ గర్ల్స్’ పెయింటింగ్ గురించి అడిగారు. ఆ పెయింటింగ్ చాలా బాగుందని మా ఇంటికి పంపిస్తారా? అని ప్రశ్నించగా.. అందులో ఉన్నది తను, ఖుషి అని తెలిపింది జాన్వీ.



Next Story

Most Viewed