- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తనవి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయో లేదో అప్పుడే కాస్ట్లీ బిల్డింగ్ కొనేసింది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు నివాసముండే ముంబైలోని జుహులో రూ. 39 కోట్ల విలువైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. అరయ బిల్డింగ్ పేరుతో ఉన్న స్వంకి అపార్ట్మెంట్ (14, 15, 16) మూడు ఫ్లోర్లలో బ్యూటిఫుల్గా డిజైన్ చేయగా.. డిసెంబర్ 7న డీల్ ఫైనల్ అయింది. డిసెంబర్ 10న రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగా.. ఇందుకోసం జాన్వీ రూ. 78 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాగా జాన్వీ ప్రస్తుతం తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్తో కలిసి ముంబైలోని లోఖండ్వాలాలో నివాసముంటుంది.
‘దఢక్, గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ.. నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ గోస్ట్ స్టోరీస్లోనూ నటించింది. కాగా ప్రజెంట్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో కలిసి ‘దోస్తానా 2’ చేస్తున్న భామ.. రాజ్ కుమార్ రావ్తో కలిసి చేసిన కామెడీ థ్రిల్లర్ ‘రూహఫ్జానా’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.