హుజురాబాద్‌లో రేవంత్‌ రెడ్డికి షాక్.. టీఆర్ఎస్‌లోకి కీలక నేత!

by  |
harish-rao
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావుతో పాటు వార్డు సభ్యులు కంకల శ్రీనివాస్, సునీత-రవీందర్, కో ఆప్షన్ సభ్యుడు కొండ శ్రీనివాస్‌లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో హుజురాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇందులో జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, జిల్లా రైతు బంధు డైరెక్టర్ కనపర్తి లింగారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సర్పంచ్ వంశీధర్ రావు గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.



Next Story

Most Viewed