- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు ఒక జెడ్పీటీసీ దక్కింది. అయితే ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా చేజారి పోయింది. జెడ్పీటీసీ సభ్యురాలిగా అమ్మాణీ అనే మహిళ ఇటీవల ఎన్నికైంది. అయితే ఈ సారి జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యం కావడంతో ఆమె తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటంతో కడియపు లంక నుంచి సర్పంచ్ గా పోటీ చేయవలసి వచ్చిందని, తర్వాత పాత నోటిఫికేషన్ నే ఎన్నికల కమీషన్ తీసుకోవడంతో అందులో కూడా పోటీ చేశానని తెలిపారు.
అయితే నిబంధనల ప్రకారం గెలిచిన తర్వాత ఏదో ఒక సీటు మాత్రమే ఉండాలి కాబట్టి తాను సర్పంచ్ గా కొనసాగడానికే నిర్ణయించుకున్నాను అని తెలిపింది. ఈ మేరకు కలెక్టర్ సి. హరికిరణ్ ను కలిసి తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా లెటర్ ఇచ్చానని చెప్పింది. దాంతో జిల్లాలో జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ కూడా పోయింది.
Next Story