రేణిగుంటలో ఉద్రిక్తత

by  |
రేణిగుంటలో ఉద్రిక్తత
X

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏర్పేడు జెడ్పీటీసీ అభ్యర్థి నితీశ్‌పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను పోలీసు వాహనంలో ఏర్పేడుకు తరలించేందుకు ప్రయత్నాలు చేయగా, వాహనంలో నుంచి దూకేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు జనసేన సమన్వయకర్త హరిప్రసాద్, మరోనేత సత్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జెట్పీటీసీ నామినేషన్‌ను ఉపసంహరించకపోవడంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

tag; ycp, janasena, renigunta, ap news

Next Story