జనసేన కీలక నిర్ణయం.. ఆ మీటింగ్‌కు దూరం

by  |
janasena party
X

దిశ, వెబ్ ‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఆల్‌ పార్టీ మీటింగ్‌కు జనసేన నేతలు హాజరుకాకూడదని నిర్ణయించారు. ఏప్రిల్ 8వ తేదీన ఏపీలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై జనసేన మండిపడింది. ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో జనసేన కేసులు ఫైల్ చేసిందని, దానిపై తీర్పు ఇంకా వెలువడక ముందే ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈరోజు జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.


Next Story