రైతులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ దీక్ష

by  |
రైతులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుఫాన్ కారణంగా పంటనష్టపోయిన రైతులకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, అనంతరం పూర్తి పరిహారంగా రూ.35 వేలు అందజేయాలని జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులకు అండగా నిలిచేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు. అంతేగాకుండా జనసేనాని పిలుపు అందుకొని, రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు తమ నిరసనలు తెలిపారు.

Next Story