దయనీయంగా రైతుల పరిస్థితి : నాదెండ్ల

by  |
దయనీయంగా రైతుల పరిస్థితి : నాదెండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: నివర్‌ తుఫాన్‌, ఇతర విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. దీనిపై నిరసనగా 28న ఏపీలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అంతేగాకుండా కృష్ణా జిల్లా కలెక్టర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినతిపత్రం సమర్పిస్తారని అన్నారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందేలా వెంటనే కేబినెట్ తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఎకరాకు రూ.35వేల ఆర్థికసాయం అందించాలని ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Next Story