- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, తాజాగా ట్రైలర్ సంచలనమైన రికార్డులు సృష్టించి, పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాయి. అయితే ఈ చిత్రం వచ్చే నెల ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏప్రిల్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్టు చిత్ర నిర్మాత దిల్రాజు పలుమార్లు తెలిపారు.
అయితే.. అదేరోజు ఏప్రిల్ 3వ తేదీన తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారని పార్టీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీలో పవన్ పాల్గొననున్నాడు. ఎమ్మార్పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తారని స్పష్టం చేసింది.
ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇండియన్ సినిమాలోనే ఇంతవరకూ ఎన్నడూ లేనంత భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుతున్నామని ఇటీవల ఈవెంట్ మేనేజన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేగాకుండా ఆ ఫంక్షన్కు మెగాస్టా్ర్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వస్తున్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే ఇంత భారీ ఫంక్షన్ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రచారంలో పాల్గొంటాడని పార్టీ ప్రకటించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఈ ఫంక్షన్కు పవన్ కళ్యాణ్ వస్తాడా? రాడా? అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. పార్టీ కార్యక్రమం పూర్తైన తర్వాత రాత్రి ఈ ఫంక్షన్ వస్తడేమో అన్న అనుమానం కూడా ఉంది. మరి ఆరోజు ఏం జరుగుతుందో చూడాలి.