‘దిశ చట్టంతో ప్రభుత్వం ఏం సాధించింది’

by  |
‘దిశ చట్టంతో ప్రభుత్వం ఏం సాధించింది’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఇంజినీరింగ్ యువతి తేజస్వినిపై కత్తితో దాడి చేసి, హత్య చేశాడు. ఈ ఘటన విజయవాడ జిల్లాలోని మాచవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. కాగా విషయం తెలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తేజస్విని ఘటన చాలా బాధాకరం అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వని, చట్టాలు చేసి ప్రయోజనం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దిశ చట్టం ద్వారా ప్రభుత్వం ఏం సాధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షలు విధించినప్పుడే చట్టాలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు.



Next Story