లక్షల మంది ఎదురుచూస్తున్నారు : పవన్ కళ్యాణ్

by  |
pawan-kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20న ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎంప్లాయిమెంట్‌ అధికారులకు జనసేన వినతిపత్రాలు ఇవ్వనుందని తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్‌లో మాత్రం కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే చూపారని మండిపడ్డారు.

Next Story