తిరుపతి అభ్యర్థిపై చర్చించాం : పవన్

by  |
తిరుపతి అభ్యర్థిపై చర్చించాం : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల కోసం కాదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఢిల్లీకి వచ్చామని అన్నారు. వివిధ అంశాలపై చర్చలు జరిపామని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఉమ్మడి కమిటీ వేశామని అన్నారు. ఉమ్మడి కమిటీ నిర్ణయం ప్రకారమే తిరుపతి అభ్యర్థి ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలనేది బీజేపీ, జనసేన నిర్ణయం అని అన్నారు. అంతేగాంకుడా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించామని తెలిపారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు.



Next Story