- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేయడం గర్హనీయమన్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.
అలాగే, ఒప్పందం చేసుకున్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చిందని గుర్తు చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపులో జాప్యం చేస్తూ.. ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతంగాన్ని నెట్టిందంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
Next Story