- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఎయిర్పోర్టు వద్దకు జనసైనికులు భారీగా చేరుకొని సేనానికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు చేస్తోన్న ఆందోళనలో పాల్గొని, వారికి సంఘీభావం తెలపనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, జనసేన అధినేత వైజాగ్లో మూడు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో బహిరంగ సభలో పాల్గొనడానికి ఇప్పటికే భారీగా జనసేన కార్యకర్తలు, నేతలు విశాఖ పట్టణానికి చేరుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story