వైసీపీ నేతల వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించాలి !

by  |

దిశ, ఏపీ బ్యూరో: నిన్న మూడు అంశాల్లో ఏపీ సర్కార్‌కు హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. పంచాయతీ రంగులు, డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల ప్రవర్తన, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లు కేసుల్లో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బాధితుల పక్షాన తీర్పులు వెలువరించింది. దీంతో పలువురు వైసీపీ నేతలు కోర్టు తీర్పులపై సందేహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత గాదె వెంకటేశ్వర్‌రావు.. నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కోర్టు తీర్పులపై వీరు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.



Next Story

Most Viewed