అమ్మా… నిన్ను రోజూ మిస్ అవుతున్నా: జాన్వీ

by  |
అమ్మా… నిన్ను రోజూ మిస్ అవుతున్నా: జాన్వీ
X

శ్రీదేవి.. అందాల రాజకుమారి.. అతిలోక సుందరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలను ఏలిన మకుటం లేని మహారాణి. నటనా జీవితంలో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందిన మహానటి. గ్లామరస్‌గా ఆకట్టుకుంటూనే తనలోని నటనాప్రతిభతో దాదాపు 30 ఏళ్లు భారత సినీ పరిశ్రమను తనవైపునకు తిప్పుకున్న మేటి. మనవరాలిగా పదహారేళ్ల పడుచుగా… ప్రేమికురాలిగా… భార్యగా… చివరికి అమ్మగా… ఒక అమ్మాయి జీవితంలోని ప్రతిదశను తెరపై చూపించి.. వాటికి ప్రాణం పోసింది శ్రీదేవి. సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన ఈ సిరిమల్లె పువ్వు… వ్యక్తిగత జీవితంలో కొన్ని అవాంతరాలు ఎదుర్కొని… చివరికి నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. నిజజీవితంలో ఇద్దరు ఆడపిల్లలకు(జాన్వీ కపూర్, ఖుషీ కపూర్) తల్లిగా మారి 15 ఏళ్లు కెమెరాకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్లీ సినిమాల్లో మెరిసింది. కానీ, దురదృష్టవశాత్తు 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచి.. అటు కుటుంబాన్ని.. ఇటు అభిమానులను దు:ఖసాగరంలో ముంచేసింది.

ఫిబ్రవరి 24, 2018న మరణించిన తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కూతురు జాన్వీ కపూర్. నువ్వు చనిపోయి రెండేళ్లు అవుతుంది అమ్మా .. అయినా నిన్నురోజూ మిస్ అవుతున్నా అని శ్రీదేవితో తన చిన్నప్పటి ఫొటోను షేర్ చేసింది జాన్వీ. ఈ పోస్ట్‌తో చాలామంది సినీ ప్రముఖులు, అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు. వర్దంతి రోజున శ్రీదేవిని స్మరించుకున్న ఫ్యాన్స్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, తన పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నారు.

Read also..

రనౌత్ సెకండ్ లుక్‌కు రనౌటే!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed