హైదరాబాద్‌లో విషాదం.. టాయ్‌లెట్‌‌కు వెళ్లిన వ్యక్తిని మింగేసిన ‘మూసీ’

by  |
హైదరాబాద్‌లో విషాదం.. టాయ్‌లెట్‌‌కు వెళ్లిన వ్యక్తిని మింగేసిన ‘మూసీ’
X

దిశ, మలక్‌పేట : హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తన కుమారుడితో కలిసి బహిర్భుమికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చాదర్‌ఘాట్‌లోని శంకర్ నగర్‌లో నివాసముండే జహంగీర్ (40) కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి మూసీ కాలువ దగ్గరకు టాయిలెట్‌కి వెళ్ళిన జహంగీర్ తన కుమారుడి కళ్ళముందే మూసీ కాలువలో కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు జీహెచ్ఎంసీ, డీఆర్‌ఎఫ్ రెస్య్కూ బృందం రంగంలోకి దిగి జహంగీర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఆందోళనకు దిగిన బంధువులు, కాలనీవాసులు

చాదర్‌ ఘాట్‌లోని శంకర్ నగర్ మూసీ కాలువలో కొట్టుకపోయిన జహంగీర్ మృతదేహం లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతో వల్లే మృతదేహం ఇంకా లభించలేదని కుటుంబ సభ్యులు, బస్తీవాసులు ఆరోపిస్తున్నారు.

Next Story