ఈటల గెలుపు కోసం యువకుడి ఆరాటం.. సైకిల్‌తో వినూత్న ప్రచారం

by  |
ఈటల గెలుపు కోసం యువకుడి ఆరాటం.. సైకిల్‌తో వినూత్న ప్రచారం
X

దిశ,వీణవంక: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన బండి సాయి అనే యువకుడు ఈటల రాజేందర్ గెలవాలని సైకిల్ యాత్ర చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో ఆయన దిశ‌తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేసి అన్యాయంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా కోర్టులో నిలువలేదని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ధర్మం వైపు ఉండి ఈటల గెలుపునకు కృషి చేయాలని కోరాడు.

Next Story

Most Viewed