కొండాపూర్‌లో పర్యటించిన జగ్గారెడ్డి

by  |
కొండాపూర్‌లో పర్యటించిన జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా అతలాకుతలం అయింది. పలుచోట్ల వాగులు, వంకలు తెగి ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని కొండాపూర్ మండలంలో మల్లేపల్లి గ్రామం చెరువు కట్ట తెగింది. దీంతో మల్లేపల్లి-గోపులారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

చెరువు కట్ట తెగడంతో దాదాపుగా రెండు వందల ఎకరాలలో పంట నీట మునిగింది. దీంతో సమాచారం అందుకున్నస్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కొండాపూర్‎లో పర్యటించి గ్రామస్తులను, రైతులను పరామర్శించారు. పంట నష్టోపయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed