రూ.కోట్లు ఖర్చు పెట్టి రాహుల్‌గాంధీ సభ పెట్టినా: జగ్గారెడ్డి

by  |
రూ.కోట్లు ఖర్చు పెట్టి రాహుల్‌గాంధీ సభ పెట్టినా: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2017లో రూ.కోట్లు ఖర్చుపెట్టి సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో భారీ బహిరంగ సభ పెట్టానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత చేసినా సోనియా, రాహుల్ గాంధీకి పంపించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కొత్తగా వచ్చిన ఇన్‌చార్జ్ తన కార్యక్రమాల గురించి తెలుసుకోకపోవడం, తనలాంటి ఆర్గనైజర్‌ పేరు ఢిల్లీ లిస్ట్‌లో పంపకపోవడం బాధకు గురిచేసిందన్నారు. అయినా సోనియా, రాహుల్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా.. కానీ పార్టీలో ఉన్న నేతలు చీలిపోకుండా పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని జగ్గారెడ్డి సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి పై విధంగా స్పందించారు.



Next Story

Most Viewed