జగపతి బాబుకు ఏమైంది..? నడిరోడ్డులో వాటిని పట్టుకొని..

by  |
జగపతి బాబుకు ఏమైంది..? నడిరోడ్డులో వాటిని పట్టుకొని..
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళల మనస్సులో ఎనలేని స్థానం సంపాదించుకున్న విలక్షణ నటుడు జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బిజీ గా మారిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా స్టార్ హీరోలందరికీ స్ట్రాంగ్ విలన్ గా పేరుతెచ్చుకున్న ఈ నటుడు ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల అమెరికా వెళ్లిన జగ్గుభాయ్ అక్కడా ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.

మొన్నటికి మొన్న తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసిన జగ్గూభాయ్ తాజాగా మరో ఫోటోను షేర్ చేశాడు. మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేసుకొని వస్తూ వినువీధిలో రెండు చేతులలో బ్యాగులతో ఫొటో కి పోజ్ ఇచ్చిన ఈ సీనియర్ హీరో దానికి ఆసక్తికరమైన వ్యాఖ్యలను జోడించాడు. బీరకాయలు, టమోటాలు, వంకాయలు, ఉల్లిపాయలు ఎన్ని గ్రాములు ఎంత ఖరీదో చెప్తూ.. చివర్లో మనుసున్న వారికి 90% డిస్కౌంట్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోకి నెటిజన్లు విభిన్న కామెంట్లు పెడుతున్నారు. అమెరికాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు..? అని కొందరు అంటుంటే.. మరికొందరు తలకాయలు కోసే బసిరెడ్డికి ఏమైంది.. బాంబులు చుట్టడం వదిలేసి కూరగాయలు కోస్తున్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్‌, సిద్దార్థ్‌ ‘మహా సముద్రం’, సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో ‘రాజమన్నార్‌’ అనే పవర్‌ ఫుల్‌ విలన్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed