కేంద్ర మంత్రికి జగన్ లేఖ

by  |
కేంద్ర మంత్రికి జగన్ లేఖ
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను క్షేమంగా వెనక్కి రప్పించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రవాసాంధ్రులను రప్పించేందుకు ఎక్కువ విమానాలను నడపాలని లేఖలో కోరారు. కిర్గిజ్‌స్థాన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లోని తెలుగు సంఘాలు, ఏపీలోకి చార్టెడ్ ఫ్లైట్స్‌ను అనుమతించాలని కోరుతున్నాయని లేఖలో వివరించారు. విదేశాల నుంచి వచ్చే వందే భారత్ విమానాలైనా లేదా చార్టెడ్ ఫ్లైట్సైనా ఎన్ని వచ్చినా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed