టీడీపీ ఆఫీస్‌లో సీఎం జగన్ ​బర్త్​డే వేడుకలు

by  |
టీడీపీ ఆఫీస్‌లో సీఎం జగన్ ​బర్త్​డే వేడుకలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఏదైనా వ్యంగ్యంగా చెప్పాలన్నా.. చమత్కరించాలన్నా గోదారోళ్ల తర్వాత నెల్లూరోళ్లే మరి. జగన్ బర్త్​డే వేడుకలను సోమవారం నెల్లూరు టీడీపీ నేతలు తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఇసుకతో తయారు చేసిన కేక్ కట్ చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగన్​కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. రెండేళ్లలో రెండుమూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చి, ప్రతీసారి రూ. వెయ్యి పెంచినట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం యూనిట్ ఇసుక ధర రూ. 6500 ఉందన్నారు. పెట్రోల్, డీజిల్‌తో సమానంగా ఇసుక రేటు పెరుగుతోందని విమర్శించారు. సరైన ఇసుక విధానం లేకపోవడం వల్ల ఏపీలో కోటి మంది ఉపాధి కోల్పోయినట్లు ఆయన వివరించారు.

Next Story