8న జగనన్న విద్యా కానుక

by  |
8న జగనన్న విద్యా కానుక
X

దిశ,వెబ్ డెస్క్:
ఏపీలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఈనెల 8న సీఎం జగన్​ ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న 42,34,322 మంది విద్యార్థులకు స్టూడెంట్​ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతీ కిట్‌లో మూడు జతల యూనిఫామ్‌లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్​బుక్స్, ఓ బ్యాగు ఉండనున్నాయి. కాగా బడి బయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, అభ్యసనా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా చేసేందుకే ఈ పథకాన్ని రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story