వ్యాక్సిన్లు పంపండి ప్లీజ్.. మోదీకి జ‌గ‌న్ మ‌రో లేఖాస్త్రం

by  |
Modi Jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్ర‌ధాని మోదీకి సీఎం వైఎస్ జ‌గ‌న్ లేఖ రాశారు. 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వయస్సు ఉన్న‌వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు సరిపడా డోసులను కేంద్రం సరఫరా చేయాలని లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ఇష్టానుసారంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తాయని, అందువ‌ల్ల ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ పంపిణీ చేయ‌డం స‌రికాద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌డం ప‌ట్ల‌ సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని లేఖలో జ‌గ‌న్ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్ల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లుమార్లు మోదీకి జ‌గ‌న్ లేఖ రాసిన విష‌యం తెలిసిందే.

Next Story