మరోసారి దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ నేతల సమక్షంలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. &#8220;వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబసభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నాను&#8221; అంటూ వ్యాఖ్యానించారు. తనకు మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని&#8230; మేనిఫెస్టోను పరమపవిత్రంగా [&hellip;]</p>

మరోసారి దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ నేతల సమక్షంలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. “వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబసభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు. తనకు మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని… మేనిఫెస్టోను పరమపవిత్రంగా భావిస్తూ ఏడాది పాలన సాగించామని తెలిపారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి, ఆరు కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నానన్నారు.

Next Story