ఏపీపీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

by  |
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 ఇతర పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేసిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed