ఉద్యోగులకు జగన్ గుడ్‌న్యూస్

by  |
ఉద్యోగులకు జగన్ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందుగా విధుల నుంచి ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 14 తేదీ నుంచి మే 13 తేదీ వరకు నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనది. భక్తి శ్రద్ధలతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. అత్యంత కఠిన నిబంధనలను పాటిస్తూ రోజూ నమాజ్ చేస్తారు.


Next Story

Most Viewed