చంద్రబాబు, జగన్ ఫొటోలు ఒకే చోట

by  |
చంద్రబాబు, జగన్ ఫొటోలు ఒకే చోట
X

దిశ, అమరావతి బ్యూరో: అసలే వాళ్లు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరు ముఖ్యమంత్రి అయితే మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేత. వారిద్దరూ ఒకే చోట ఉండటం అసంభవం. అలాంటిది ప్రభుత్వ అమలు చేస్తున్న ఓ పథకానికి సంబంధించిన కార్యక్రమంలో ఆ ఇద్దరి ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఇంతకీ ఎక్కడ ఆ ఫోటోలు, ఎవరివి అనే వివరాలలోకి వెళితే.. తిరుపతిలో చేపట్టిన 104, 108 వాహనాల రథయాత్ర ప్రారంభ సమావేశం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంతో తప్పిదం చోటుచేసుకుంది. ప్రారంభ సమావేశ వేదికకు పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన చిన్నపాటి ఫోటోతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోను పెట్టారు. ఫ్లెక్సీకి అవతల వైపు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఫొటో దర్శనమిస్తోంది.

Next Story

Most Viewed