బీసీలకు అండగా నిల్చింది ఎన్టీఆర్​ తర్వాత జగనే !

by  |
బీసీలకు అండగా నిల్చింది ఎన్టీఆర్​ తర్వాత జగనే !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది ఎన్టీఆర్​ తర్వాత సీఎం జగనేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఇటీవల ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల అభినందన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్​ వెనుక బీసీలు నడిస్తే నేడు జగన్​తో అడుగేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 56బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి కార్యవర్గాలను నియమించిన ఘనత సీఎం జగన్​దేనని తెలిపారు.

Next Story

Most Viewed