ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్.. రూ.10 కోట్లు ఎక్కడివి?  

by  |
ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్.. రూ.10 కోట్లు ఎక్కడివి?  
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరైంది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో తనకు కనెక్షన్ ఉందని అనుమానిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయగా.. ఢిల్లీలోని కార్యాలయంలో జరగనున్న ఇన్వెస్టిగేషన్‌‌కు ‌అటెండ్ అయింది. ఈ కేసులో విట్‌నెస్‌గా తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్న విచారణ ఏజెన్సీ.. ఇంతకు ముందు కూడా తనను ప్రశ్నించింది.

మల్టీ మిలియనీర్ అయిన చంద్రశేఖర్ రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల విలువైన పర్షియన్ పిల్లిని జాక్వెలిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఇంటరాగేషన్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు ఆయన జైలులో ఉన్నప్పుడు దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులను పంపించినట్లు రిపోర్ట్ చెబుతుండగా.. ఓ బిజినెస్‌ మ్యాన్ వైఫ్ నుంచి సుఖేష్ బలవంతంగా వసూలు చేసిన భారీ మొత్తాన్ని కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఇచ్చినట్లు ఈడీ అనుమానిస్తోందని సమాచారం.

Next Story

Most Viewed