- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోడుభూముల కోసం పోరాటామే..

దిశ, ఇల్లందు: ఇల్లందు మండలం రామకృష్ణాపురం లో శుక్రవారం ప్రదర్శన గ్రూప్ మీటింగ్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు గోగ్గెల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, హరితహారం పేరుతో పేదలు, ఆదివాసీల భూములను ఫారెస్ట్ వారు అక్రమంగా ఆక్రమించుకొని మొక్కలునాటడం నిలుపుదల చేయాలని, ఈనెల 9వ తేదీన కొమరారంలో జనరల్ బాడీని, అనంతరం ప్రారంభమయ్యే పోడు భూముల రక్షణకై జరిగే పాదయాత్రను, చలో కొత్తగూడెం కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాల రద్దుకై దేశ రాజధానిలో పోరాడుతున్నా రైతులకు అభినందనలు తెలిపారు. అలాగే పోడుభూముల అక్రమంగా ఆక్రమించుకోవాడాన్ని నిలిపివేయాలని, ఇప్పటివరకు ఆక్రమించిన పోడుభూమిని ఎవరి భూములు వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోడుభూముల రక్షణకై ఈ నెల 9 న కొమరారంలో జరుగు జనరల్ బాడీలో అందరూ పాల్గొనాలని కోరారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు.
అలాగే 11న కొత్తగూడెం చలో కలెక్టరేట్ కు ప్రతి ఆదివాసీ, గిరిజన, పేద రైతులు వ్యక్తిగత దరఖాస్తుతో హాజరై మన సమస్యల పరిస్కారానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీజిల్లా నాయకులు కొక్కు సారంగపాణి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు చింత నర్సింహారావు, సర్పంచ్ రజిత, రమేష్ నాగేశ్వరరావు, సమ్మయ్య, గోపాల్, మల్లేష్, నరేష్, వసంత రావు, సమ్మక్క, ఆదిలక్ష్మి, ఎల్లమ్మ, యశోద, రుక్మిణి, స్థానికులు పాల్గొన్నారు.