కోహ్లీ కోసం తెల్లజెర్సీల్లో.. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లాన్‌ సూపర్..!

by Phanindra |

ఐపీఎల్ పునఃప్రారంభంలో తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో తెల్లజెర్సీలతో వచ్చి కోహ్లీని సర్‌ప్రైజ్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

కోహ్లీ కోసం తెల్లజెర్సీల్లో.. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లాన్‌ సూపర్..!
X

దిశ, స్పోర్ట్స్: భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి మళ్లీ ఐపీఎల్ మొదలవనుంది. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ, తడబడుతున్న కేకేఆర్ మధ్య చిన్నస్వామిలో మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం అవనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఫ్యాన్స్ అంతా టెస్టు జెర్సీలు వేసుకొని రావాలని, అది లేని వాళ్లు తెల్ల టీషర్ట్ వేసుకున్నా పర్లేదని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా టెస్టులకు కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఈ ప్లాన్ చేస్తున్నారు. చిన్నస్వామిలో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఇలా వైట్ జెర్సీల్లో వచ్చి కోహ్లీని సర్‌ప్రైజ్ చెయ్యాలనే ఈ ప్లాన్‌కు క్రికెట్ అభిమానుల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది.

Next Story