- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : ముంబైని ఇంటికి పంపి.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు దూసుకెళ్లిన పంజాబ్
ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్స్ లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లు తలపడనున్నాయి.

దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్స్ లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ ఫైనల్స్ కు చేరగా.. క్వాలిఫైయర్ 2 లో పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ ను ఓడించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. దీంతో ఈ రెండు జట్లలో ఎవరొకరు కప్పుతో బోణీ కొట్టడం ఖాయమైంది. ముంబై బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన పంజాబ్ బ్యాటర్లు.. మొదటి నుంచి సత్తా చాటుతూ వచ్చారు. ముంబై ఇచ్చిన 204 రన్స్ టార్గెట్ ను అవలీలగా చేధించారు. ఐదు వికెట్ల నష్టానికి 19 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 207 పరుగులు చేసి.. ముంబైను ఇంటికి పంపింది.
పంజాబ్ ఓపెనర్లుగా దిగిన ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ లు ఎక్కువ సమయం క్రీజులో నిలబడలేకపోయారు. మూడో ఓవర్ లో ప్రభ్ సిమ్రన్ (6) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తొలుత ఫ్యాన్స్ నిరుత్సాహ పడినా.. తర్వాత ఆట గాడిలో పడటంతో జోష్ వచ్చింది. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ బరిలోకి దిగి.. వరుసగా రెండు బౌండరీలు బాదాడు. నాలుగో ఓవర్లో ముంబై బౌలర్ టోప్లీ 14 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 5వ ఓవర్లో 20 పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్ లో జోష్ ఇంగ్లిష్ రెండు సిక్సలు, రెండు ఫోర్లు బాదడంతో.. ముంబై ఫ్యాన్స్ చతికిలపడ్డారు. 55 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ ను కోల్పోయింది. 5.1 ఓవర్ వద్ద భారీ షాట్ కు ప్రయత్నించిన ప్రియాంశ్ ఆర్య (20).. హార్దిక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. పవర్ ప్లే ముగిసే సరికి శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. స్పిన్నర్ మిచెల్ శాంటర్న్ చేతికి బాల్ ఇవ్వడంతో పంజాబ్ పరుగుల వరదకు బ్రేక్ పడినట్లయింది. ఏడో ఓవర్లో ఆరే పరుగులు చేశారు పంజాబ్ బ్యాటర్లు.
8వ ఓవర్లో 5వ బంతికి జోష్ ఇంగ్లిస్ (38) ఔటయ్యాడు. ఈ ఓవర్లో హార్దిక్ రెండే రన్స్ ఇచ్చి.. ముంబై పరువును కాపాడుకున్నాడనిపించినా.. 10వ ఓవర్లో ఏకంగా 17 రన్స్ సమర్పించుకున్నాడు. 13వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ తనలోని బ్యాటర్ ను నిద్రలేపాడు. టోప్లీ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సులు బాదడంతో 19 పరుగులొచ్చాయి. 16వ ఓవర్లో నేహాల్ వధేరా (48) హాఫ్ సెంచరీకి రెండు పరుగుల ముందు అశ్వనీ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. అయినప్పటికీ ఈ ఓవర్లో 16 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ రెండు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 17వ ఓవర్లో పంజాబ్ కెప్టెన్ హాఫ్ సెంచరీ చేసి.. మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 19వ ఓవర్లో మూడు సిక్సులు బాదిన శ్రేయస్ (87) జట్టును గెలిపించుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.






