IPL2025: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. 60కే 7 వికెట్లు

by Gantepaka Srikanth |

అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్(Punjab Kings) బ్యాటర్లు చేతులెత్తేశారు.

IPL2025: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. 60కే 7 వికెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్(Punjab Kings) బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయారు. బెంగళూరు(Royal Challengers Bengaluru) యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌ తలో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్యా(07), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(18), జోష్ ఇంగ్లిష్(04), శ్రేయాస్ అయ్యర్(02), నేహాల్ వధేరా(08), శషాంక్ సింగ్(03) స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో భారతమంతా బౌలర్లపై పడింది. తొలి క్వాలిఫయర్‌లో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు విఫలం కావడంతో అభిమానలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఛంఢీగడ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నది.

Next Story