IPL 2025: రస్సెల్ విధ్వంసం.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-04 12:02:40  IST  )

ఐపీఎల్‌ 2025(IPL)లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికైంది.

IPL 2025: రస్సెల్ విధ్వంసం.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2025(IPL)లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా బ్యాటర్లు అదరగొట్టారు. అందరూ మూకుమ్మడిగా రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లపై దాడి చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేశారు. రాజస్థాన్ విజయం సాధించాలంటే 207 పరుగులు చేయాల్సి ఉంది. కేకేఆర్ బ్యాటర్లలో గుర్బాజ్ (35), రహానే (30), రఘువంశీ (44), రస్సెల్ (57), రింకూ సింగ్ (19), సునీల్ నరైన్ (11) పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరును అందించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, యుధ్‌వీర్, తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు.

Next Story