దంచి కొడుతున్న ‘సన్’ రైజర్స్

by Dishafeatures2 |
దంచి కొడుతున్న ‘సన్’ రైజర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దంచికొడుతున్నారు. 12 ఓవర్లలో 117 రన్స్ తో ముంబై బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నారు. ఓపెనర్ వివ్రాంత్ శర్మ 61 పరుగులతో క్రీజులో ఉండగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 52 పరుగులు చేశాడు. ఇక మొదటి వికెట్ తీసేందుకు రోహిత్ సేన తీవ్రంగా శ్రమిస్తోంది. ముంబై బౌలర్ క్రిస్ జోర్డాన్ రెండు ఓవర్లలోనే 24క పరుగులు ఇవ్వగా.. గ్రీన్ మాత్రం ఒక ఓవర్ వేసి 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ తో టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో ప్లేస్ కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి.


Next Story

Most Viewed