ఇలా కొడితే ఎలా.. సన్‌రైజర్స్, ఆర్సీబీ విధ్వంసం పై సచిన్ స్పందన

by Disha Web Desk 12 |
ఇలా కొడితే ఎలా.. సన్‌రైజర్స్, ఆర్సీబీ విధ్వంసం పై సచిన్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగిన 30 మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 287 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ 262 పరుగులు చేసింది. దీంతో ఒకే మ్యాచుల్లో 549 పరుగుల నమోదయ్యాయి. ఈ మ్యాచ్ అత్యధికంగా.. 81 బౌండరీలు నమోదు కాగా.. అందులో 43 ఫోర్లు, 38 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో జరిగిన విధ్వంసంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందించారు. నిన్నటి మ్యాచ్ లో ఇరు జట్టు భారీ స్కోర్ చేయడంపై ట్విట్టర్ వేదికగా.. ఇరా రాసుకొచ్చారు. సన్‌రైజర్స్, ఆర్సీబీ పవర్ హిట్టింగ్ తో బౌలర్లను ఆడుకున్నారు. 30 ఓవర్లలో 549 పరుగులు చేయడం రికార్డుల్లోకి ఎక్కింది. మరి ఇంతలా ఫోర్లు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడితే.. రాబోయే కాలంలో ఎవరైనా బౌలర్ అవ్వాలని అనుకుంటారా..? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed