ఆర్సీబీ జట్టుకు భారీ షాక్.. ఇలా జరిగితే ప్లే ఆఫ్ నుంచి అవుట్

by Disha Web Desk 12 |
ఆర్సీబీ జట్టుకు భారీ షాక్.. ఇలా జరిగితే ప్లే ఆఫ్ నుంచి అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో చివరి లీగ్ మ్యాచ్ ఆర్సీబీ, గుజరాత్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. కాగా ఆ మ్యాచ్ ఆర్సీబీ జట్టుకు చావో రేవో తేల్చుకునేది కావడంతో ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులంతా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. RCB జట్టు ఈ మ్యాచ్ లో నిలవాలి అంటే. హైదరాబాద్ చేతిలో ముంబై ఓడిపోవాల్సి ఉంది. అలా కాకుండా SRH జట్టుపై ముంబై గెలిస్తే.. RCB ఖచ్చితంగా గుజరాత్ జట్టుపై గెలవాల్సి ఉంది.

కాగా ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే వాతావరణ శాఖ ఆర్సీబీ అభిమానులకు భారీ షాకింగ్ వార్త తెలిపింది. ఈ రోజు సాయంత్రం నుంచి బెంగళూరు ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. దీంతో మ్యాచ్ ప్రారంభం కాకుండా వర్షం పడితే.. ఇరు జట్లకు ఒక్క పాయింట్ ఇస్తారు. ఇలా చేస్తే.. ఆర్సీబీ ప్లే ఆఫ్ నుంచి దూరం అవుతుంది. దీంతో ముంబై ఓడిపోవడంతో పాటు.. ఆర్సీబీ, గుజరాత్ మధ్య 70వ మ్యాచ్ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read more:

నేడు ముంబై vs హైదరాబాద్ మ్యాచ్.. గెలిస్తే ప్లే ఆఫ్‌లో Mumbai Indians



Next Story

Most Viewed