- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > చెన్నయ్, బెంగళూరు మ్యాచ్ను అన్ని కోట్ల మంది చూశారా?
చెన్నయ్, బెంగళూరు మ్యాచ్ను అన్ని కోట్ల మంది చూశారా?
ఐపీఎల్-17 సీజన్ మొదటి రోజే డిజిటల్ స్ట్రీమింగ్లో రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ సాధించింది.

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 సీజన్ మొదటి రోజే డిజిటల్ స్ట్రీమింగ్లో రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ సాధించింది. చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ గత రికార్డులను బద్దలుకొట్టింది. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్కాస్టర్ జియో సినిమాలో మ్యాచ్లు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. జియో సినిమాలో ఓపెనింగ్ డేను 11.3 కోట్ల మంది వీక్షించగా.. 59 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. గత సీజన్ ఓపెనింగ్ డేతో పోలిస్తే ఇది 51 శాతం పెంపు. వాచ్ టైం 660 కోట్ల నిమిషాలుగా నమోదైంది. ఐపీఎల్ను వీక్షించడానికి డిజిటల్ ఉత్తమ మార్గమని చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యమని వయాకామ్-18 ప్రతినిధి తెలిపారు.
Next Story






