IPL 2023: ఆర్సీబీ బౌలర్ల విజృం‍భణ.. రాజస్తాన్‌‌పై బెంగళూరు ఘన విజయం

by Disha Web Desk 13 |
IPL 2023: ఆర్సీబీ బౌలర్ల విజృం‍భణ.. రాజస్తాన్‌‌పై బెంగళూరు ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్స్ విజృం‍భణతో రాజస్తాన్‌ను 112 రన్స్‌ తేడాతో చిత్తు చేసింది. ఆర్సీబీ రన్‌రేటును భారీగా పెంచుకుని ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 172 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హెట్మెయర్ (35), రూట్ (10) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌గా పెవిలియన్‌కు చేరారు. దీంతో రాజస్తాన్ 10.3 ఓవర్‌లో 59 రన్స్‌కే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్‌లో.. పార్నెల్ 3, బ్రేస్వేల్ 2, కరణ్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, మ్యాక్స్‌వెల్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్‌లో.. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి (18) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌(55), వన్‌డౌన్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(54) హఫ్ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో అనూజ్‌ రావత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్‌లో.. అడమ్ జంపా 2, ఆసిఫ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.

Also Read..

IPL 2023: ఆర్సీబీ కెప్టెన్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా..



Next Story