Ambati Rayudu :ఇవాళే నా చివరి మ్యాచ్

by Disha Web Desk 13 |
Ambati Rayudu  :ఇవాళే నా చివరి మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి గుజరాత్‌తో పోటీ పడేందుకు చెన్నై టీం రెడీ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో కూడా చెన్నై టీంలో ఎలాంటి మార్పులూ చేయకూడదని ధోనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఫెయిలవుతున్నా కూడా అంబటి రాయుడుకు మరో అవకాశం ఇవ్వాలని అతను డిసైడ్ అయ్యాడట. దీనికి సంబంధించి అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. "ఇవాళ రాత్రి ఆడే మ్యాచ్ నా కెరీర్‌లో చివరిది. ఈ రాత్రి ఫైనల్ IPL లో నా చివరి గేమ్ అని నేను నిర్ణయించుకున్నాను.. యూ టర్న్ తీసుకునే ప్రసక్తే లేదని" అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. అయితే ఈ రెండు జట్లు తలపడిన తొలి క్వాలిఫైయర్‌లో కూడా రాయుడు పెద్దగా ఆకట్టుకోలేదు. ఐపీఎల్‌లో 203 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4,329 పరుగులు చేయగా.. ఇందులో 1 సెంచరీ, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Also Read..

బ్రేకింగ్: ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ గుడ్ బై



Next Story