IPL 2023: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న టీమ్ ఇండియా లెజెండ్.. (వీడియో)

by Disha Web Desk 13 |
IPL 2023: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న టీమ్ ఇండియా లెజెండ్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. స్లో వికెట్‌పై బ్యాటింగ్‌లో తడబడిన ధోనీ సేన.. డ్యూ కారణంగా బౌలింగ్‌లో తేలిపోయింది. మ్యాచ్ అనంతరం స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు బహుమతులు అందజేసింది. ధోనీ సేన.. ఫ్రాంచైజీ టీషర్ట్స్‌తో పాటు టెన్నిస్ రాకెట్స్, బాల్స్‌ను గ్యాలరీలోకి విసిరేసింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ధోనీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.

గవాస్కర్ విజ్ఞప్తి మేరకు ధోనీ.. తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ధోనీ రిటైర్మెంట్ అవుతాడనే ఉద్దేశంతోనే గవాస్కర్ ఈ ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్రాంచైజీ కోరిక మేరకు ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed